Trikaala Yagnam
Trikaala Yagnam
Trikaala Yagnam BY suryadevara rammohanrao
సూర్యదేవర రామ్ మోహన్ రావు ఒక ప్రముఖ తెలుగు రచయిత. తెలుగు కన్నడ భాషల్లో నవలా రచనలో సుప్రసిద్ధుడు. ఈయన రాసిన నవలలు స్వాతి లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో 1942లో అనంతయ్య, వెంకట నరసాంబ దంపతులకు రామమోహనరావు 6 వ సంతానంగా జన్మించారు. 1985 నుండి సుమారు 95 నవలలు వ్రాశారు. ఈయన నవలలు దిన, వార, మాస పత్రికల్లో సీరియళ్ళుగా ప్రచురితమవుతున్నాయి. తెలుగు సాహిత్యంలో రామ్మోహనరావు అత్యధికంగా నవలలు వ్రాసి చరిత్ర సృష్టించారు. ఈయన వ్రాసిన 200 చిన్నపాటి కథలు కన్నడ, తమిళంలో అనువాదమయ్యాయి. కొన్ని నవలలు సినిమాలుగా, టి.వి సీరియళ్ళుగా చేయబడ్డాయి. ఈయన వ్రాసిన నవల ముక్తేశ్వరి పునరాగమనం తెలుగు నవలా ప్రపంచంలో రికార్డుకెక్కింది. ప్రతి నవలకు ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్స్ సృష్టించడం రామమోహనరావు ప్రత్యేకత. 2002లో 60 వ పుట్టిన రోజున మైసూరులో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతులమీదుగా దత్తపీఠం ఆస్థాన విద్యాన్ పురస్కారాన్ని అందుకున్నారు. 1996 లో కళాభారతి వారి బెస్ట్ రైటర్ ఆఫ్ ది ఈయర్ అవార్డును భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైన వెంకయ్య నాయుడు చేతుల మీదుగా గెల్చుకున్నారు. రామమోహనరావుకు సతీమణి పద్మజ రాణి, ఇద్దరు కుమారులు - కాళి అనంత్, తేజస్వి అనంత్ ఉన్నారు.