Telugu Sahithyam Lo Hasyamrutham
Telugu Sahithyam Lo Hasyamrutham
Telugu Sahithyam Lo Hasyamrutham by Dwana Sastry
తెలుగు సాహిత్యంలో హాస్యామృతం
ద్వాదశి నాగేశ్వరశాస్త్రి తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత. ద్వానాశాస్త్రి గా ఆయన పేరుపొందాడు. ఇతడు కృష్ణాజిల్లా లింగాలలో 1948 జూన్ 15 వ తేదీన జన్మించాడు తల్లి లక్ష్మీప్రసన్న. తండ్రి కృష్ణశాస్త్రి.
ఏలూరు సర్. సి.ఆర్. రెడ్డి కాలేజిలో బి.ఎస్.సి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) చదివాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్, తెలుగు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు. ఇతని గురువులలో ప్రముఖులు తూమాటి దోణప్ప, చేకూరి రామారావు, బండ్లమూడి సత్యనారాయణ, కొత్తపల్లి వీరభద్రరావు. విశ్వవిద్యాలయంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి (శ్రీ శ్రీ కి, ఆరుద్రకు ఛందస్సు నేర్పిన గురువు) కవిత్వం మీద ఎం. ఫిల్. సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాడు. సాహిత్యసంస్థలపై చేసిన పరిశోధనకి గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను స్వర్ణ పతకముతో పాటు పి.హెచ్.డి.తో సత్కరించింది. అటు పిమ్మట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశాడు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store