Teeram Cherina Naava
Teeram Cherina Naava తీరం చేరిన నావ P Lokeshwar
1969నుంచి 2014వరకు నలభై అయిదు సంవత్సరాల ప్రయాణం. ప్రపంచం తలకిందులైన, అలలుఅలలుగా వెల్లువెత్తి విరిగిపడిన-కాలం. మూడు నవలల్లో ముడుచుకున్న వైభవోజ్జ్వల అధ్వానశకం. కాలంఅనేక తలాలలో, అనేక స్థలాలలో, అనేక పార్శ్వాలలో ఏకకాలంలో ఉంటుంది. ఒకే చరిత్రలో మునిగితేలిన అసంఖ్యాక జీవితాలు. అనేక చరిత్రలను రచించిన ప్రజాసమూహాలు. బీభత్సాలు, యుద్ధాలు, విప్లవాలు, విజయాలు, వైఫల్యాలు, విశ్వవిహారాలు, అణ్వస్త్రాలు, ఆకలి, పీడన, వేదన.. సర్వవ్యాప్త, అనుక్షణ వీక్షణల సాక్షి - కాలం. ఒక ప్రపంచమానవుడు, ఒక పైదాయిషీ, హైదరాబాదీ అనేక అలజడులు- మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇదీ ‘ఈ మూడు నవలల బంగారం’ సారాంశం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store