Mantada to Manhattan naa jeevanayaanam
Mantada to Manhattan
మంటాడ to మ్యాన్హ్యాటన్ నా జీవనయానం
అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన క్యాన్సర్ వైద్య నిపుణులు, ఫిజీషియన్గా నిత్యనూతన మార్గదర్శి, తత్త్వవేత్త డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పదహారణాల తెలుగువారు. దత్తాత్రేయుడు కృష్ణా జిల్లాలో మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21 న జన్మించాడు.తండ్రిపేరు సత్యనారాయణ. మచిలీపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కర్నూలు వైద్య కళాశాలలో వైద్యశాస్త్రంలో పట్టా పొంది, ఆ తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడంలో సిద్ధహస్తులు. కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు అతను చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇస్టిట్యూట్ కి జన్మనిచ్చింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా "ఆరోగ్య సంపద"ను పెంచడానికి, అభివృద్ధి చెందడానికి వెచ్చించారు ఈ అంతర్జాజీయ ఆణిముత్యము తెలుగువాడు కావడం మన అందిరికీ గర్వకారణము .