Mahabharata Charitramu
Mahabharata Charitramu
Mahabharata Charitramu BY Pendyala Venkata Subramanya
వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని చోడవరం గ్రామంలో నవంబరు 5, 1877 (బహుధాన్య కార్తీక బహుళ షష్ఠి) తేదీన జన్మించారు. తండ్రి వద్ద ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం. శొంఠి భద్రాద్రి రామశాస్త్రి వద్ద కావ్య నాటకాలంకారాలను చదివి సంస్కృతంలో పాండిత్యాన్ని సంపాదించారు. పిదప ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి, తర్వాత కాకినాడలోని పిఠాపురం మహారాజావారి కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా నియమితులయ్యారు. పిఠాపురం మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిని ప్రాచీనాంధ్ర గ్రంథ సంపాదనకై నియమించారు. ఆ పనిమీద మైసూరు, మద్రాసు, తంజావూరు వంటి ప్రాంతాలతో పాటుగా పలు తెలుగు ప్రాంతాల్లో తిరిగి విలువైన గ్రంథాలనెన్నిటినో సంపాదించారు. ఆ తర్వాత బందరు నేషనల్ కళాశాలలోను, రాజోలు బోర్డు హైస్కూలులోను కూడా ఆంధ్రోపన్యాసకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. [1] వీరు ప్రాచీన సంస్కృత వాజ్మయాన్ని ఒక నూతనరీతిలో పరిశోధన చేసి మంచి విమర్శకులుగా పేరుపొందారు. వీరి కృషి ఫలితంగా మహాభారత చరిత్ర (1923) అనే విమర్శన గ్రంథం వెలువడింది. ఆ గ్రంథాన్ని సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు వాదప్రతివాదాలకు దిగారు. చివరకు కేసు కోర్టులకు ఎక్కింది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store