Chattisgarh Scooter Yatra
Chattisgarh Scooter Yatra by Paravasthu Lokeshwar
జ్ఞానులు ఒకే స్థలంలో స్థిరంగా ఉండక జ్ఞాన సముపార్జన కోసం నిరంతరం సంచరిస్తూ ఉండాలి. లోక సంచారి కానివాడు జ్ఞాని కాలేడు. జ్ఞాని అనేవాడు లోక సంచారి కాకతప్పదు. ఆదిభిక్షువు శివుడు జంగమ దేవరగా ఈ స్థావర జంగమాత్మక ప్రపంచంలో నిరంతరం సంచరించినవాడే. సిద్ధార్ధుడు బుద్దుడిగా పరివర్తన చెంది, పరివ్రాజికుడిగా పర్యటించినవాడే. ఆది శంకరుడు మొదలుకొని వివేకానందుడి దాకా ఎందరెందరో సాధువులు, సన్యాసులు, సంత్లు, సూఫీ ఫకీర్లు ఆసేతు హిమాచలం సంచరించిన వారే. మహమ్మద్ ప్రవక్త, జీసస్ కూడా ఆ కోవకు చెందినవారే. సంచరించటం ఆసియా దేశవాసుల పురాతన సంప్రదాయం. అతి ప్రాచీన సంస్క•తి. పూర్వకాలంలో ‘‘దేశాటనం’’ విద్యాభ్యాసం చివరలో ఒక ముఖ్యమైన భాగం. 10 రోజులలో 1943 కి.మీలు స్కూటర్పై పర్యటించిన ఛత్తీస్ఘడ్ సాహసయాత్రా కధనం.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store